Wednesday, March 5, 2008

బడుగులకు దక్కింది అడుగూ బొడుగూ...!

(బడ్జెట్ లో దళితులకు జరిగిన కేటాయింపుల గురించి కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర లు రాసిన ఈ వ్యాసం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది.)
అగ్రవర్ణాల ఇళ్ళలో జరిగే సామూహిక భోజనాల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, సంచార, అర్థసంచార జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కథ ఎలా ఉందంటే, దేశంలో ఏ పల్లెటూరులోనైనా అగ్రవర్ణాల ఇళ్ళలో సామూహిక భోజనాలు జరిగినపుడు ఆహ్వానితుల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, అర్థసంచార, సంచా ర జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతా యి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌ని ప్రవేశపె ట్టింది. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల బడ్జెట్‌లకన్న, చాలా రాష్ట్రాల బడ్జెట్‌ల కన్న తమ బడ్జెట్ చాలా పెద్దదనీ, గత బడ్జెట్‌ల కన్న రెట్టింపు బడ్జెట్ అని ప్రభుత్వ పెద్దలు ఈ సందర్భంగా చెప్పుకు న్నారు. లక్షకోట్ల రూపాయల పైగా అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బడుగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. అణగారిన సామాజిక వర్గాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు కావాలంటున్న దళిత ఫ్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బడుగుల సంక్షేమానికి కొత్త బడ్జెట్‌లో తిరిపెం విదిల్చినట్టు నిధులు కేటాయించిం ది. బహుజనులు శంకించినట్టుగానే సాగునీరు, వ్యవసాయం, పారిశ్రా మిక మౌలిక సదుపాయాలకల్పన, పెద్దకంపెనీలు, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ ప్రత్యేక ఆర్థికమండళ్ళ అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా జరి పింది. తద్యారా అగ్రకుల బడాబాబులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒక రూపాయి ప్రభుత్వం నడపడం కోసం, ఒక రూపాయి ప్రజల సంక్షేమం కోసం అనుకుంటే, లక్షకోట్ల రూపాయలు మించిన కొత్త బడ్జెట్ లో రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న దళితుల సంక్షేమానికి తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. అలాగే 7 శాతంగా ఉన్న ఆదివాసులకు 3,500 కోట్లు, 52 శాతంగా ఉన్న వెనుకబడిన తరగతులకు 26,000 కోట్లు, 12 శాతంగా ఉన్న మైనారిటీలకు 6,000 కోట్లు కేటాయించాలి. ఇలా చేసి సామాజిక న్యాయాన్ని చాటుకొని ఉంటే బాగుండేది. దానికి భిన్నంగా దళితులకు 1,293 కోట్లు, గిరజనులకు 440 కోట్లు, బిసిలకు 353 కోట్లు, మైనారిటీలకు 177 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 656 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దామాషా ప్రకారం న్యాయంగా కేటాయించాల్సిన వాటితో పోలిస్తే ఈ అంకెలు చాలా తక్కు వని అర్థమౌతుంది. అంతేకుకుండా బడ్జెట్‌లో కేటాయించిన వాటికన్నా చాలా తక్కువగా విడుదల చేస్తోంది. విడుదల చేసిన దాంట్లో కొంత దారిమళ్ళించగా, కొంత మిగులుగా చూపెడుతున్నది. చివరికి ఖర్చు పెడుతున్నది చాలా తక్కువైనపుడు, భారీ బడ్జెట్ అని ప్రభుత్వం చెప్పే దంతా పెద్ద మోసమని అర్థమౌతుంది. 90 శాతంగా ఉన్న ప్రజలకు 10 శాతాన్ని, 10 శాతంగా ఉన్న ధనికులకు 90 శాతాన్ని బడ్జెట్‌లో కేటా యించి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. బడుగులను కొట్టి, బడా బాబులకు దోచిపెట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం, ఆర్థిక-సామాజిక అధ్యయనా ల కేంద్రం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆరునె లల క్రితం రాష్ట్రంలో నెలకొన్న పేదరికంపై అధ్యయనం నిర్వహించాయి. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం మంది పేదలున్నారని, వీరిలో 18.6 శాతం మంది కటిక పేదలన్న వాస్తవాన్ని అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే 80 శాతం మంది గ్రామీణులు నిర్ధారిత కేలరీల కంటే తక్కువ కేలరీలున్న ఆహారా న్ని తీసుకుంటున్నారనీ, పట్టణ ప్రాంతాల్లో సైతం 73 శాతం మంది పేదలు ఇలాంటి ఆహారలేమితోనే ఉన్నారన్న చేదు నిజాలను వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లోనైనా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రాధాన్యతలతో కూడిన కేటాయింపులు జరపకపోవడం దారుణం. ఇప్పటికే 93,593 కోట్ల రుణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిం ది. ప్రతి వ్యక్తిని సగటున 10,628 రూపాయలకు తాకట్టు పెట్టింది! అదే వైఖరిని ఇంకా కొనసాగిస్తోంది. గత బడ్జెట్‌లతో పోల్చినపుడు ఈ బడ్జెట్ లో ఎస్సీలకు 57 శాతం, గిరిజనులకు 39 శాతం, బిసిలకు 77 శాతం, మైనారిటీలకు 47 శాతం బడ్జెట్ పెంచినట్లు ఆర్థిక మంత్రి కాకిలెక్కలేసి చూపించారు. స్పెషల్ కాంపొనెంట్ ప్లాను కింద గత పదేళ్ళలో ప్రభుత్వాలు ఎస్సీల కు కేటాయించిన నిధుల్లో 13,000 కోట్ల రూనాయలను దారి మళ్ళిం చాయి. బకాయి పడ్డ నిధులను తిరిగి ఎస్సీలకోసం జమచేసే ఎటువంటి హామీ ఈ బడ్జెట్‌లో లేదు. ప్రత్యేక అంశ ప్రణాళిక కింద దళితుల సంక్షే మం కోసం ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించాల్సిన 8,000 కోట్లు పెద్ద మొత్తంగా కోతకు గురయ్యాయి. రెండు కోట్ల మంది ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేస్తామన్న 'నోడల్ ఏజెన్సీ' ఏమైందో ప్రభుత్వం జాడ చెప్పదు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదివే ఎస్సీ, ఎస్టీ, బిసి పేద విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. విద్యా సామాగ్రి, భోజనాలు, బట్ట లు, కాస్మటిక్స్ తదితరాలకు గాను ఒక్కొక్క విద్యార్థిపై రోజుకు సగటున 20 రూపాయల చొప్పునైనా ఉపకారవేతనాలను ఈ బడ్జెట్ కల్పించలేక పోయింది. పేద వర్గాల విద్యార్థినీ, విద్యార్థులంతా స్కూళ్ళు, హాస్టళ్ళు వదిలిపెట్టి బాల కార్మికులుగా మారే ఆర్థిక విధానాలను ప్రభుత్వం అను సరిస్తున్నదన్న అనుమానం కేటాయింపుల వాస్తవాలను గమనించిన ఎవ రికైనా కలుగక మానదు. వృత్తికులాల వారైన చర్మకారులు, రజకులు, వడ్డెరలు, నాయీబ్రా హ్మణ, చేపలుపట్టే మొదలగు సెక్షన్ల ప్రజల సంక్షేమాన్ని ఈ బడ్జెట్ విస్మ రించింది. సంచార, అర్థసంచార జీవనం సాగిస్తూ భిక్షుక వృత్తిలో జీవించే సమూహాల సంక్షేమాన్ని అలాగే అత్యంత వెనుకబడిన తరగతులు, విక లాంగులు, జోగినులు, సెక్స్‌వర్కర్లు, వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లొ నామమాత్రం చేసింది. భూమిలేని దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల భూ అవస రాలను తీర్చడానికి బడ్జెట్ దోహదం చేసేదిగా లేదు. పేదరైతుల భూము లు గుంజుకుని, ప్రభుత్వ భూములను కలిపి విదేశీ సంస్థలకు చౌకగా ప్రభుత్వం కట్టబెడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలా భూము లన్నిట్నీ ఉన్నవాళ్ళకే సమర్పిస్తూపోతే, రానున్న వందఏళ్ళలో ప్రజావస రాలకు ఏం చేస్తుందన్నది ఊహించడం సాధ్యంకావడంలేదు. దళిత వర్గా ల సంక్షేమాన్ని అర 'చేతి'లో వైకుంఠంగా చూపి, ధనికులను మరింత ధని కులుగా మారుస్తున్న ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు ఓట్ల కోసమే ప్రవేశపెట్టిందనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో 'హస్త' లాఘవంతో కూడుకున్న అంకెల మాయ తప్ప వాస్తవాభివృద్ధి కన్పించదు. -జూపాక సుభద్ర, కృపాకర్‌మాదిగ

No comments: